
DET: Sep 14: ఈ అందాల భామ హిందీ, తెలుగు, తమిళ భాషల్లో పలువురు అగ్రనటులతో కలిసి నటించింది. అందం, నటనతో ఎంతోమంది ఫ్యాన్స్ను తన సొంతం చేసుకుంది. సుమారు 30 ఏళ్ల సినీ కెరీర్ ఉన్న ఈమెకు.. వ్యక్తిగత జీవితం మాత్రం ఓ చేదు జ్ఞాపకం అని చెప్పొచ్చు. ఏకంగా 12 మందితో ఎఫైర్, ఆపై పెళ్లైన 2 ఏళ్లకే విడాకులు.. ఇలా జరగరానివి అన్ని జరిగాయి.
ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా సింగిల్ గా ఉన్న ఆ హీరోయిన్ తాజాగా చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. పైన కనిపిస్తున్న బ్యూటీ ఇండస్ట్రీలో చాలా పాపులర్ నటి. ఇప్పటికీ సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటుంది. అంతే కాదు ఈ స్టార్ హీరోయిన్ చావు అంచుల వరకు వెళ్లొచ్చింది. ఎంతో ధైర్యంతో ఆమె చావును కూడా ఎదిరించింది. ఐదు పదుల వయసు దాటినా కూడా ఇప్పటికీ తరగని అందంతో ఆకట్టుకుంటుంది.
పై ఫొటోలో ఉన్న హీరోయిన్ మరెవరో కాదు. మనీషా కొయిరాలా. 1970లో నేపాల్ లో జన్మించిన మనీషా.. ఆమె నేపాలీ చిత్రం ఫేరి భేతౌలా (1989)తో సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత సౌదాగర్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రయాణం స్టార్ట్ చేసింది.. 1991వ సంవత్సరంలో, నటి మనీషా కొయిరాలా చౌధాకర్ అనే హిందీ చిత్రంతో కథానాయికగా రంగప్రవేశం చేసింది. ఆ తర్వాత హిందీ, తమిళం, తెలుగు సినిమాల్లో నటించడం మొదలుపెట్టారు. మనీషా కొయిరాలా ఎక్కువగా బాలీవుడ్ సినిమాపై దృష్టి పెట్టింది. ఇక ఆమె నటించిన బొంబాయి, ఒకేఒక్కడు, భారతీయుడు సినిమాలు భారీ హిట్ అయ్యాయి. దాంతో ఒక్కసారిగా మనీష పేరు మారుమ్రోగింది. కాగా మనీష క్యాన్సర్ తో పోరాడి గెలిచిన విషయం తెలిసిందే.2012లో మనీషా అండాశయ క్యాన్సర్ బారినపడ్డారు. మూడేళ్ల చికిత్స అనంతరం 2015లో ఆమె క్యాన్సర్ను జయించారు. మొన్నటివరకు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఆమె ఇప్పుడు తిరిగి సినిమాల్లో నటిస్తుంది.
