
DNews : Dec 02: ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని మున్నేటి ప్రాంతంలో మద్యం దుకాణం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సమాచారం అందుకున్న వెంటనే బీజేపీ పార్లమెంటరీ ఇన్చార్జ్ దేవాకి వాసుదేవరావు అక్కడికి చేరుకుని ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ ఇళ్లకు వెళ్లే మార్గంలో చెత్తను పారేయడం సరైనది కాదని స్పష్టం చేశారు. స్థానికుల సమస్యలను పరిష్కరించకపోతే, పరిస్థితి మళ్లీ పునరావృతమైతే, ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలతో మాట్లాడి వారి కష్టాలను అర్థం చేసుకున్నారు. బీజేపీ నాయకులు ప్రజల సమస్యలను పట్టించుకుని, పరిష్కారం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
