
DNews : Dec 02: నెలకొండపల్లి లో మాజీ ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు మాధుకన్ షుగర్ ఇండస్ట్రీ రైతులకు అండగా నిలుస్తోందని తెలిపారు. 2025-26 సీజన్కు సంబంధించిన క్రషింగ్ మెషిన్ను మాధుకన్ షుగర్ ఇండస్ట్రీ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ నామ కృష్ణయ్యతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ, ఈ పరిశ్రమ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర (MRP) కంటే రైతులకు అదనంగా నగదు చెల్లించడం ప్రశంసనీయమని అన్నారు. అలాగే, ఒక టన్ను చెరకు ధరతో పాటు రైతులకు ఉచితంగా అర కిలో చక్కెర అందించడం కూడా అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కంపెనీ ఏవీపీ కోటయ్య, అసిస్టెంట్ కేన్ కమిషనర్ రవీందర్, మేనేజర్ నరేష్ తదితరులు పాల్గొన్నారు.
