
DNews: Apr28: భారత్ మరియు న్యూజిలాండ్ మధ్య చారిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) ఏప్రిల్ 27, 2026న న్యూఢిల్లీలో వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ మరియు న్యూజిలాండ్ ట్రేడ్ మంత్రి టాడ్ మెక్క్లే సమక్షంలో ఈ ఒప్పందం సంతకం అయింది ఖరారైంది. ఈ ఒప్పందం వల్ల భారతీయ ఎగుమతులకు భారీ ఊతం లభించనుంది.
భారత ఎగుమతులపై సున్నా సుంకాలు
100% ఎగుమతులపై రాయితీ: న్యూజిలాండ్కు వెళ్లే 100 శాతం భారతీయ వస్తువులపై దిగుమతి సుంకాలను (Tariffs) పూర్తిగా రద్దు చేశారు.
ప్రయోజనం పొందే రంగాలు: ముఖ్యంగా వస్త్రాలు (Textiles), దుస్తులు, తోలు వస్తువులు (Leather), జెమ్స్ అండ్ జువెలరీ, ఇంజనీరింగ్ వస్తువులు, ఫార్మాస్యూటికల్స్ మరియు ఆటోమొబైల్ విడిభాగాలకు ఈ ఒప్పందం ద్వారా విదేశీ మార్కెట్లో మంచి పోటీతత్వం లభిస్తుంది.
గతంలో ఈ వస్తువులపై న్యూజిలాండ్ సుమారు 10% వరకు సుంకం విధించేది, ఇకపై అది 0% కి చేరుతుంది.
పెట్టుబడులు మరియు ఉపాధి
భారీ పెట్టుబడులు: రాబోయే 15 ఏళ్లలో న్యూజిలాండ్ భారత్లో 20 బిలియన్ డాలర్ల (సుమారు ₹1.66 లక్షల కోట్లు) పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించింది.
వీసా సౌకర్యం: భారతీయ నిపుణుల కోసం న్యూజిలాండ్ ప్రత్యేకంగా ఏటా 1,667 తాత్కాలిక పని వీసాలను (గరిష్టంగా 5,000 వరకు) కేటాయించింది. ఇది ఐటీ, హెల్త్కేర్ మరియు ఇంజనీరింగ్ నిపుణులకు ఉపయోగపడుతుంది.
భారత్ తీసుకున్న జాగ్రత్తలు
మన దేశీయ రైతుల ప్రయోజనాలను కాపాడటం కోసం పాల ఉత్పత్తులు (Dairy), వెన్న, చీజ్, చక్కెర, మరియు ఉల్లిపాయలు వంటి సున్నితమైన వ్యవసాయ ఉత్పత్తులను ఈ ఒప్పందం నుండి మినహాయించారు. అంటే వీటిపై సుంకాలు యథావిధిగా కొనసాగుతాయి.
