
DNational 03 Dec: ఏరోస్పేస్ భద్రతా సాంకేతికతలో స్వావలంబన దిశగా మరో కీలక ముందడుగుగా, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) ఫైటర్ విమానాల ఎస్కేప్ సిస్టమ్కు సంబంధించిన హై-స్పీడ్ రాకెట్–స్లెడ్ పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. గంటకు 800 కిలోమీటర్ల నియంత్రిత వేగంతో నిర్వహించిన ఈ క్లిష్టమైన డైనమిక్ పరీక్ష, భారతదేశాన్ని అధునాతన ఇన్-హౌస్ ఎస్కేప్ సిస్టమ్ పరీక్షా సామర్థ్యాలు కలిగిన “ఎలైట్ క్లబ్ ఆఫ్ నేషన్స్”లో నిలిపింది.
ఈ పరీక్ష చండీగఢ్లో ఉన్న టెర్మినల్ బాలిస్టిక్స్ రీసెర్చ్ లాబొరేటరీ (TBRL)లోని రైల్ ట్రాక్ రాకెట్ స్లెడ్ (RTRS) సౌకర్యంలో జరిగింది. అధిక వేగంలో సంభవించే వాస్తవ అత్యవసర పరిస్థితులను అనుకరించి, స్వదేశీ యుద్ధ విమాన ఎస్కేప్ సిస్టమ్లోని కీలక భద్రతా అంశాలను ధృవీకరించడం ప్రధాన లక్ష్యం.
విజయవంతమైన ఈ ట్రయల్ ఎయిర్క్రూ ఎస్కేప్ చైన్లోని మూడు ముఖ్య భాగాల పనితీరును నిర్ధారించింది:
• కానోపీ సెవెరెన్స్: కాక్పిట్ కానోపీని సురక్షితంగా విడదీయడానికాని, పేల్చివేయడానికాని ఉపయోగించే యంత్రాంగం.
• ఎజెక్షన్ సీక్వెన్సింగ్: సురక్షిత ఎజెక్షన్కు అవసరమైన ఖచ్చితమైన, క్షణాల వ్యవధిలో జరిగే చర్యల క్రమం.
• పూర్తి ఎయిర్క్రూ రికవరీ: పారాచూట్ ఆధారిత రికవరీ సిస్టమ్ సక్రమ విస్తరణ మరియు పనితీరు.
ఈ పరీక్ష కోసం లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ (LCA) తేజస్ విమానం యొక్క ముందుభాగం ప్రత్యేకంగా సిద్ధం చేసి, డ్యూయల్–స్లెడ్ వ్యవస్థపై అమర్చారు. లక్ష్య వేగం సాధించేందుకు బహుళ ఘన ఇంధన రాకెట్ మోటార్లను దశలవారీగా ప్రేరేపించారు.
ఈ డైనమిక్ ఎజెక్షన్ ట్రయల్ స్థిర విమానం నుండి జరిగే పరీక్షలు (నెట్ టెస్టులు, “జీరో-జీరో” పరీక్షలు) కంటే అత్యంత కఠినమైనదని, వాస్తవ పరిస్థితులకు మరింత దగ్గరగా ఉంటుందని రక్షణ అధికారులు తెలిపారు.
పైలట్ స్థితిని అనుకరించేందుకు అత్యాధునిక ఆంత్రోపోమోర్ఫిక్ టెస్ట్ డమ్మీ (ATD)ను ఉపయోగించారు. ఎజెక్షన్ సమయంలో పైలట్ అనుభవించే లోడ్లు, ఝట్కాలు, త్వరణం వంటి ముఖ్య పరామితులన్నింటినీ ATD రికార్డు చేసింది. మొత్తం ఎజెక్షన్ క్రమాన్ని హై-స్పీడ్ ఆన్బోర్డ్, గ్రౌండ్ ఆధారిత ఇమేజింగ్ సిస్టమ్లు నమోదు చేశాయి.
DRDO, ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ADA), హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) సంయుక్తంగా ఈ ప్రదర్శనను విజయవంతం చేశాయి. భారత వైమానిక దళం (IAF) మరియు ఏరోస్పేస్ మెడిసిన్ సంస్థ (IAM)కి చెందిన సీనియర్ అధికారులు ఈ పరీక్షను ప్రత్యక్షంగా వీక్షించారు.
రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ విజయాన్ని అభినందిస్తూ, ఇది “భారత స్వదేశీ రక్షణ సామర్థ్యాల్లో ఒక ప్రధాన మైలురాయి”గా పేర్కొన్నారు. అలాగే, యుద్ధ విమానాల కీలక ఎయిర్క్రూ ఎస్కేప్ సిస్టమ్ల పరీక్షల కోసం విదేశీ ఒరిజినల్ ఎక్విప్మెంట్ తయారీదారులపై ఆధారాన్ని తగ్గించే సామర్థ్యాన్ని ఇది భారత్కు అందజేస్తుందని ఆయన అన్నారు.
