
DNews: Feb24: రాష్ట్రంలో వేడిగాలులు కొనసాగుతున్నాయి. సోమవారం చాలా చోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు 1 నుండి 2 డిగ్రీలు పెరిగాయి. తుని, మచిలీపట్నం, నందిగామ, నంద్యాల, కర్నూలు, కడప, అనంతపురం తదితర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 34 డిగ్రీలు దాటాయి. కర్నూలులో 36.2 డిగ్రీలు, అనంతపురంలో 36.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం సోమవారం బలహీనపడి అల్పపీడనంగా మారింది. ఇది ఈశాన్య దిశగా కదులుతుందని, మంగళవారం నాటికి బలహీనపడుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
