
DNews: Dec 08: హైదరాబాద్లో ప్రారంభమైన గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమంలో పాల్గొన్న విదేశీ ప్రతినిధులు సోమవారం నాగార్జునసాగర్లోని బుద్ధవనం సందర్శించారు. ఈ సందర్భంగా ప్రసిద్ధ పరిశోధకుడు శివనాగి రెడ్డి వారికి బుద్ధవనం గురించి విశదీకరించారు. బౌద్ధ సాంస్కృతిక వారసత్వం, చారిత్రక ప్రాధాన్యం, అక్కడి శిల్పకళా వైభవం గురించి ఆయన వివరణ ఇచ్చారు. అనంతరం పర్యాటక సంస్థకు చెందిన లాంచ్లో ప్రతినిధులు నాగార్జునసాగర్ జలాశయంలో గంటన్నర పాటు బోటు విహారం చేశారు. ఈ ప్రయాణంలో వారు సాగర సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ, బుద్ధవనం చుట్టూ ఉన్న ప్రకృతి దృశ్యాలను వీక్షించారు. ఈ పర్యటన ద్వారా తెలంగాణలోని బౌద్ధ వారసత్వం, నాగార్జునసాగర్ జలాశయ సౌందర్యం గురించి విదేశీ ప్రతినిధులకు అవగాహన కలిగింది.
