
DNews: Mar23: సైబర్ నేరగాళ్ల బారిన పడి రూ. 12 లక్షలు కోల్పోయిన ఎమ్మెల్యే బాలరాజు విశ్వసనీయ సమాచారం ప్రకారం, ఆర్టీఏ చలాన్ చెల్లించమని వాట్సాప్లో ఎమ్మెల్యేకు ఒక సందేశం వచ్చింది. అందులోని లింక్పై ఆయన క్లిక్ చేయగానే, ఆయన బ్యాంకు ఖాతా నుంచి విడతల వారీగా మొత్తం రూ. 12 లక్షలు మాయమయ్యాయి. తాను సైబర్ మోసానికి గురయ్యానని గ్రహించిన ఎమ్మెల్యే, వెంటనే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితులను గుర్తించి, పోగొట్టుకున్న డబ్బును తిరిగి రాబట్టేందుకు దర్యాప్తు ప్రారంభించారు. గుర్తుతెలియని వ్యక్తులు పంపే అనుమానాస్పద లింక్లపై క్లిక్ చేయవద్దని అధికారులు ప్రజలను హెచ్చరిస్తున్నారు.
