
DNews: 10 Oct: ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సంగంజాగర్లమూడిలో జరిగిన దారుణ హత్య కేసు స్థానికుల్లో కలకలం రేపుతోంది. బాపట్ల జిల్లా వేమూరు మండలం ఏడవురు గ్రామానికి చెందిన కుర్రా గణేష్కు, దూరపు బంధువులైన తెనాలికి చెందిన కీర్తి అంజనీ దేవి అనే యువతితో పెళ్లి సంబంధం కోసం వెళ్లిన కుటుంబసభ్యులు కుర్రా గణేష్ పొట్టిగా ఉన్నాడని పెళ్లికి నిరాకరించిన యువతి తల్లిదండ్రులు.. కానీ మొదటి చూపులోనే ఒకరినొకరు ఇష్టపడ్డ కుర్రా గణేష్, కీర్తి అంజనీ దేవి ఒకరి నెంబర్లు ఒకరు మార్చుకొని, రోజు ఫోన్ మాట్లాడుకుంటూ దగ్గరైన వీరిద్దరూ.. పెద్దలు ఒప్పుకోవడం లేదని పారిపోయి 10 రోజుల క్రితం అమరావతి గుడిలో పెళ్లి చేసుకున్న ఈ జంట. గుంటూరు పవర్ ఆఫీసు సమీపంలోని బుడంపాడులో కొత్తజంట కాపురం పెట్టుకుని నివసిస్తున్నారు.
అంజనీదేవి కుటుంబం, ముఖ్యంగా ఆమె సోదరుడు దుర్గారావు (వయసు సుమారు 25-30) ఈ పెళ్లికి వ్యతిరేకించారు. గణేష్ పొట్టిగా (తక్కువ ఎత్తు) ఉన్నాడని, చెల్లికి మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడని దుర్గారావు కోపంతో పగబట్టాడు. పెళ్లి తర్వాత కొత్తజంట నల్లపాడు పోలీస్ స్టేషన్లో రక్షణ కోరుతూ కౌన్సెలింగ్ తీర్చుకున్నారు. అప్పటికే దుర్గారావు పోలీస్ స్టేషన్లోనే “బావను చంపేస్తాను” అని హెచ్చరించాడు.
పెళ్లి గుడిలో చేసుకున్నందున రిసెప్షన్ గ్రాండ్గా చేయాలనుకున్న గణేష్, స్నేహితుడితో కలిసి గుంటూరుకు వెళ్లి బంగారం తాకట్టు పెట్టి డబ్బు తీసుకున్నాడు. డబ్బు తీసుకుని ఇంటికి తిరిగి వస్తున్న గణేష్ను మార్గమధ్యలో దుర్గారావు మరో ఇద్దరు స్నేహితులతో కలిసి అడ్డగించాడు. మొదట గొడవ పడి, తర్వాత రాయితో కొట్టి, కత్తులతో విచక్షణా రహితంగా పొడిచి పరారయ్యారు. స్నేహితుడు గణేష్ను గుంటూరు ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లాడు, కానీ అప్పటికే మృతి సంభవించింది.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న చేబ్రోలు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణలో దుర్గారావు మరియు అతని స్నేహితులు నేరాన్ని అంగీకరించారు. ముగ్గురినీ అరెస్ట్ చేశారు. ఈ హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది, మరియు ప్రేమ వివాహాలపై కుటుంబ వ్యతిరేకతలు తీవ్ర పరిణామాలకు దారితీస్తాయనే సందేశం ఇస్తోంది.
