
DNews: Dec 11: తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లా రామరెడ్డి మండలంలో గ్రామపంచాయతీ ఎన్నికల మొదటి దశ పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగింది. ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ పోలింగ్ కేంద్రాలకు హాజరయ్యారు. అయితే, ఈ ఎన్నికల సందర్భంగా కామారెడ్డి జిల్లాలోని చిన్న గోకుల్ తండా గ్రామ ప్రజలు ఎన్నికలను బహిష్కరించారు. పెద్ద గోకుల్ తండా గ్రామ ప్రజలు సర్పంచ్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడంలో తమకు సమాచారం ఇవ్వలేదని చిన్న గోకుల్ తండా ప్రజలు ఆరోపించారు. అంతేకాకుండా, సర్పంచ్ పదవి వేలం ద్వారా నిర్ణయించబడిందని వారు విమర్శించారు. దీనికి నిరసనగా చిన్న గోకుల్ తండా ప్రజలు ఓటు వేయకుండా తమ గ్రామాల్లోనే ఉండిపోయారు. వారు ప్రత్యేక పంచాయతీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిన్న గోకుల్ తండా ప్రజల డిమాండ్పై అధికారులు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
