
DNews: Dec 05: దుబాయ్ నుండి హైదరాబాద్కు వచ్చిన ఎమిరేట్స్ EK-526 విమానానికి బాంబు బెదిరింపు ఇమెయిల్ రావడంతో షంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేయబడింది. ప్రయాణికులు సురక్షితంగా దిగారు, ఎటువంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదు.
హైదరాబాద్ షంషాబాద్ విమానాశ్రయంలో శుక్రవారం ఉదయం పెద్ద కలకలం రేగింది. ఎమిరేట్స్ EK-526 విమానం (దుబాయ్–హైదరాబాద్)కు బాంబు బెదిరింపు ఇమెయిల్ రావడంతో వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. ఉదయం 7:30 గంటలకు విమానాశ్రయ కస్టమర్ సపోర్ట్ ఐడీకి ఈమెయిల్ చేరింది. వెంటనే CISF, విమానాశ్రయ భద్రతా సిబ్బంది పూర్తి స్థాయి భద్రతా చర్యలు చేపట్టారు. ఉదయం 8:30 గంటలకు విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. ప్రయాణికులను విమానం నుండి దింపి, లగేజీ, కార్గో హోల్డ్, విమానాన్ని పూర్తిగా తనిఖీ చేశారు. ఎటువంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదు.
ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గతంలో కూడా షంషాబాద్ విమానాశ్రయానికి ఇలాంటి బెదిరింపు ఇమెయిల్స్ వచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో విమానాశ్రయం పరిసరాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. బాంబు స్క్వాడ్, పోలీసులు విమానాశ్రయం పరిసరాలను పరిశీలిస్తున్నారు. దేశవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా ఇలాంటి బెదిరింపులు పెరుగుతున్నాయి. ఇటీవల ఇండిగో విమానాలకు కూడా ఇలాంటి బెదిరింపులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
