
DNews: Nov 18: సిరిసిల్లలో మంగళవారం వేములవాడలో మీడియాతో మాట్లాడిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అర్బన్ నక్సల్స్పై తీవ్ర విమర్శలు చేశారు. పట్టణాల్లో జల్సాలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని, ఏ పార్టీ అధికారంలో ఉన్నా వారు సంపదలు కూడబెట్టుకుంటున్నారని ఆయన ఆరోపించారు. అర్బన్ నక్సల్స్ మాటలు నమ్మి నిరుపేదలు, అమాయకులు అడవుల్లో తుపాకులతో తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మావోయిస్టుల మరణాలకు అర్బన్ నక్సల్స్ే కారణమని, వారిని మద్దతు ఇచ్చే వారు దేశద్రోహులని పేర్కొన్నారు. మావోయిస్టులు తక్షణమే తుపాకులు వదిలి ప్రజల జీవితాల్లోకి రావాలని సూచించారు. మావోయిస్టులకు ఇంకా నాలుగు నెలల సమయం మాత్రమే ఉందని, వచ్చే మార్చిలో మావోయిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని స్పష్టం చేశారు.
ఇదే నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లి ఏజెన్సీ ప్రాంతంలో మంగళవారం ఉదయం భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఇందులో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, టాప్ లీడర్ హిడ్మా సహా పలువురు మావోయిస్టులు హతమయ్యారు. వారి మృతదేహాలను రాంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు. ఈ ఘటన నేపథ్యంలో ఆ ప్రాంతంలో భారీ పోలీసు బలగాలను మోహరించారు.
ఇక కేంద్ర ప్రభుత్వం దేశంలో మావోయిస్టులను 2026 మార్చి చివరికి పూర్తిగా నిర్మూలించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ‘ఆపరేషన్ కాగర్’ పేరుతో మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో కంబింగ్ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు వేలాది మంది మావోయిస్టులు హతమయ్యారు, వందల సంఖ్యలో వారు లొంగిపోయారు, అనేక మంది అరెస్టు అయ్యారు. మావోయిజాన్ని నిర్మూలించేందుకు కేంద్రం వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.
