Athlete Jyothi gets Group-1 job, 500-yard house in Visakhapatnam (DTv Telangana)

DNews: Jan29:ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అథ్లెట్ జ్యోతి యర్రాజీకి శుభవార్త అందించింది. 2025లో జరిగిన ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో జ్యోతి బంగారు పతకం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆమె ప్రతిభను గుర్తించి గ్రూప్-1 ప్రభుత్వ ఉద్యోగం, విశాఖపట్నంలో 500 గజాల ఇంటిని బహుమతిగా ప్రకటించింది. ప్రభుత్వం ఇచ్చిన బహుమతి పట్ల జ్యోతి ఆనందం వ్యక్తం చేసింది. తనను ఈ స్థాయిలో ప్రోత్సహించినందుకు సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌లకు ఆమె హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. “ఇలాంటి గౌరవం లభించడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరి ప్రోత్సాహం వల్లే నేను ఈ విజయం సాధించగలిగాను. దేశానికి, రాష్ట్రానికి మరిన్ని పతకాలు తీసుకురావడానికి నేను నిరంతరం కృషి చేస్తాను” అని జ్యోతి యర్రాజీ భావోద్వేగ వీడియోను విడుదల చేశారు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana