
D Educt: Sept 9: ఆయుష్ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ, ప్రైవేట్, అన్ఎయిడెడ్, నాన్మైనారిటీ ఆయుష్ కళాశాలల్లో 2026-27 విద్యాసంవత్సరానికి కన్వీనర్ కోటా కింద బీఏఎంఎస్ (ఆయుర్వేద), బీహెచ్ఎంఎస్ (హోమియోపతి), బీయూఎంఎస్ (యునాని) కోర్సుల్లో ప్రవేశాలకు ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. సెప్టెంబర్ 8న ఈ నోటిఫికేషన్ను జారీ చేసింది.
నీట్ యూజీ-2026లో అర్హత సాధించిన విద్యార్థులు ఆయుష్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని విశ్వవిద్యాలయం సూచించింది. అభ్యర్థులు సెప్టెంబర్ 16 రాత్రి 9 గంటల్లోగా తమ దరఖాస్తులను సమర్పించాలి.
నీట్ కటాఫ్ మార్కులు
జనరల్ (ఓసీ/ఈడబ్ల్యూఎస్) కేటగిరీ అభ్యర్థులకు నీట్ కటాఫ్ మార్కులు 715 నుంచి 213 వరకు ఉండాలి. ఇది 50వ పర్సంటైల్కు సమానం. జనరల్ (ఓసీ/ఈడబ్ల్యూఎస్-పీడబ్ల్యూడీ) కేటగిరీలోని దివ్యాంగ అభ్యర్థులకు 212 నుంచి 177 మార్కులు ఉండాలి. ఇది 45వ పర్సంటైల్ అర్హతగా నిర్ణయించారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీ అభ్యర్థులకు 40వ పర్సంటైల్ అర్హత కింద 212 నుంచి 117 మార్కులు ఉండాలి. బీసీ/ఎస్సీ దివ్యాంగ అభ్యర్థులకు 193 నుంచి 177 మార్కులు, ఎస్టీ దివ్యాంగ అభ్యర్థులకు 191 నుంచి 178 మార్కులు కటాఫ్గా నిర్ణయించారు.
అర్హత కలిగిన విద్యార్థులు నిర్ణీత గడువులోగా ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసి, ఆయుష్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన తదుపరి కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొనాల్సి ఉంటుంది.
