D Educt: Sept 5: టీచర్స్ డేతో ఉపాధ్యాయులకు ప్రధాని మోదీ అభినందనలు.. జాతీయ అవార్డు గ్రహీతలతో ముచ్చట

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలను కలిశారు. న్యూఢిల్లీలోని తన అధికారిక నివాసంలో నిర్వహించిన ఈ సమావేశంలో ఉపాధ్యాయులతో ప్రధాని ఆత్మీయంగా ముచ్చటించారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంతో పాటు సమాజ అభివృద్ధిలో గురువులు అందిస్తున్న సేవలను మోదీ ప్రశంసించారు. ఈ సందర్భంగా ప్రముఖ విద్యావేత్త, మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ను ప్రధాని స్మరించుకున్నారు.

టీచర్లతో ప్రధాని సరదా సంభాషణ

ఉపాధ్యాయులతో జరిగిన సమావేశంలో వారి బోధనా విధానాలు, విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించేందుకు చేస్తున్న ప్రయత్నాల గురించి ప్రధాని మోదీ ఆసక్తిగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఓ ఉపాధ్యాయుడు పిల్లలకు ఇంటర్వ్యూలు చేయడం నేర్పిస్తున్నానని చెప్పగా.. “మరి ఇంట్లో తల్లిదండ్రులను కూడా ఎందుకు వంట చేశారని అడుగుతున్నారా?” అంటూ మోదీ సరదాగా ప్రశ్నించారు. దీంతో సమావేశంలో నవ్వులు పూశాయి.

పబ్లిక్ స్పీకింగ్‌ శిక్షణ ఇస్తున్న మరో ఉపాధ్యాయుడితోనూ ప్రధాని సరదాగా మాట్లాడారు. తాను విద్యార్థిగా ఉంటే మంచి స్పీకర్‌గా మారేందుకు ఎలాంటి సలహాలు ఇస్తారని ఆ టీచర్‌ను మోదీ అడిగారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులతో ప్రధాని మోదీ స్నేహపూర్వకంగా ముచ్చటించారు.

ఏకలవ్య విద్యార్థుల ప్రతిభపై చర్చ

ఏకలవ్య రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థులు ఐఐటీ, ఎన్‌ఐటీ వంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశాలు సాధిస్తున్న తీరును ఉపాధ్యాయులు ప్రధానికి వివరించారు. విద్యార్థుల ప్రతిభను వెలికితీసేందుకు తాము చేస్తున్న ప్రయత్నాల గురించి వివరించారు.

అదే సమయంలో బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు చేపట్టిన పరిశోధనలు, వివిధ కార్యక్రమాల గురించి కూడా ఉపాధ్యాయులు ప్రధాని మోదీకి వివరించారు.

పిల్లల స్క్రీన్ టైమ్‌పై ప్రధాని ఆందోళన

ప్రస్తుతం పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యల్లో అధిక స్క్రీన్ టైమ్‌ కూడా ఒకటని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మొబైల్ ఫోన్లు, ఇతర డిజిటల్ పరికరాలకు పిల్లలు ఎక్కువ సమయం కేటాయించకుండా వారిని క్రీడలు, బహిరంగ ఆటలు, సృజనాత్మక కార్యక్రమాల వైపు ప్రోత్సహించాలని ఉపాధ్యాయులకు సూచించారు.

అదే సమయంలో డ్రగ్స్‌ బారిన పడుతున్న యువతను కాపాడేందుకు టీచర్లు మరింత అప్రమత్తంగా ఉండాలని మోదీ సూచించారు. విద్యార్థుల ప్రవర్తనలో కనిపించే మార్పులను ఎప్పటికప్పుడు గమనించి, అవసరమైన సమయంలో వారికి సరైన మార్గనిర్దేశం చేయాలని చెప్పారు.

పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకండి

విద్యార్థులకు కేవలం సిలబస్‌ను పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకోకుండా.. వారి ఆసక్తులు, సామర్థ్యాలను గుర్తించి ప్రోత్సహించాలని ప్రధాని మోదీ అన్నారు. పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.

విద్యార్థులు చదువుతో పాటు తమ బాల్యాన్ని కూడా ఆనందంగా ఆస్వాదించేలా పాఠశాలల్లో అనుకూల వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని ప్రధాని పేర్కొన్నారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధిలో గురువుల పాత్ర ఎంతో కీలకమని మోదీ స్పష్టం చేశారు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana