D News: Aug 18: అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన ఏడుగురు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లి పది రోజులు గడిచినా తిరిగి రాకపోవడంతో తీవ్ర ఆందోళన నెలకొంది. చేపల వేటకు వెళ్లిన బోటు బయలుదేరిన గంటకే ఫోన్ సిగ్నల్స్‌ కట్ కావడంతో కుటుంబ సభ్యుల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. బోటు ఆచూకీ కోసం కోస్ట్‌గార్డ్, మెరైన్ పోలీసులు, ఫిషరీస్ అధికారులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.

కోనసీమ మత్స్యకారులు సముద్రంలో గల్లంతై పది రోజులు కావడంతో తీర ప్రాంతంలో ఆందోళన మరింత పెరిగింది. తమ కుటుంబ సభ్యులు క్షేమంగా తిరిగి వస్తారన్న ఆశతో బాధితుల కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. అయితే ఇంతవరకు బోటు ఆచూకీ లభించకపోవడంతో నడి సముద్రంలో అసలు ఏం జరిగిందన్న ప్రశ్నలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఏడుగురు మత్స్యకారుల కోసం నాలుగు షిప్పులతో కోస్టల్ సెక్యూరిటీ పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు.

వివరాల ప్రకారం..

అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు ఫిష్ ల్యాండింగ్ సెంటర్‌కు చెందిన బోటు ఈ నెల 3న చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లింది. ఈ బోటు 12వ తేదీన తిరిగి తీరానికి చేరుకోవాల్సి ఉంది. అయితే గడువు దాటినా ఇప్పటివరకు బోటు తిరిగి రాలేదు. బోటులో కోపనాతి రామకృష్ణ, సంఘాని తాతారావు, పాలెపు పాపారావు, కొల్లాటి శ్రీను సహా మరో ముగ్గురు మత్స్యకారులు ఉన్నట్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు.

బోటు సముద్రంలోకి వెళ్లిన గంటకే ఫోన్ సిగ్నల్స్‌ నిలిచిపోయినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. నిర్ణీత సమయానికి బోటు తిరిగి రాకపోవడంతో వారిలో ఆందోళన మొదలైంది. సమాచారం అధికారులకు చేరడంతో వెంటనే గాలింపు చర్యలు ప్రారంభించారు.

అలర్ట్ అయిన జిల్లా కలెక్టర్

మత్స్యకారులు గల్లంతైన విషయం తెలియగానే జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్. మహేష్ కుమార్ అప్రమత్తమయ్యారు. బోటు విశాఖపట్నం లేదా పారాదీప్ తీరాల వైపు వెళ్లి ఉండొచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నట్లు తెలిపారు. బోటు ఆచూకీ కోసం జిల్లా ఎస్పీ రాహుల్ మీనాతో మాట్లాడి, వెంటనే రంగంలోకి దిగాలని ఇండియన్ కోస్ట్‌గార్డ్‌ను కోరినట్లు వెల్లడించారు.

బోటు యజమాని, మత్స్యకారుల కుటుంబ సభ్యుల నుంచి పూర్తి వివరాలను సేకరించి రెస్క్యూ బృందాలకు అందజేసినట్లు అధికారులు తెలిపారు. అందుబాటులో ఉన్న సమాచారంతో గాలింపు చర్యలను వేగవంతం చేశారు.

ముమ్మరంగా గాలింపు చర్యలు

ప్రస్తుతం మెరైన్ పోలీసులు, ఫిషరీస్ అధికారులు సమన్వయంతో గాలింపు చర్యలను కొనసాగిస్తున్నారు. సుమారు 15 రోజులకు సరిపడా రేషన్, డీజిల్‌తో బోటు సముద్రంలోకి వెళ్లినట్లు అధికారులు తెలిపారు. అయినప్పటికీ బోటు ఆచూకీ లేకపోవడంతో తీర ప్రాంత గ్రామాల్లో ఆందోళన నెలకొంది.

మత్స్యకారులు క్షేమంగా తిరిగి రావాలని వారి కుటుంబ సభ్యులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అధికారులు కూడా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తూ బోటు ఆచూకీ కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.

ట్యూనా చేపల వేట కోసం వెళ్లినట్లు సమాచారం

ట్యూనా చేపల వేట కోసం మత్స్యకారులు డీప్ సీ ప్రాంతంలోకి వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో ఆ దిశగా కూడా గాలింపు చర్యలను ముమ్మరం చేయనున్నారు. నేవీ హెలికాప్టర్ల సహాయంతో గాలింపు చేపట్టేందుకు కోస్ట్‌గార్డ్ అధికారులు సిద్ధమవుతున్నారు. ఏడుగురు మత్స్యకారులు, బోటు ఆచూకీ త్వరగా లభించాలని కుటుంబ సభ్యులు, స్థానికులు కోరుతున్నారు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana