
DNews: Jan24: అన్నవరం జాతీయరహదారిపై సత్యదేవుని నమూనాలయం వద్ద ప్రసాదం నిల్వ ఉంచే బుట్టల్లో ఎలుకలు పరిగెత్తుతూ కనిపించాయి. ప్రసాదం బుట్టలో ఎలుకలు పరిగెత్తుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. విశాఖపట్నంకు చెందిన ఒక భక్తుడు ఈ వీడియోను పోస్ట్ చేయడంతో అన్నవరం ప్రసాదం మరోసారి వార్తల్లో నిలిచింది. దీనిపై అక్కడి సిబ్బంది భక్తులను ప్రశ్నించగా, “మీరు కొనాలనుకుంటే కొనండి, లేకపోతే వెళ్లిపోండి” అని వారు దురుసుగా సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రసాదం కౌంటర్ చుట్టూ ఎలుకలు పరిగెత్తుతున్న విషయం అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో అధికారులు చాలా సీరియస్ అయ్యారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఆలయ ఈఓ ఆదేశాలు జారీ చేశారు.
