
DNews Dec18 2025:హైదరాబాద్: భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ శుక్రవారం (డిసెంబర్ 19) తెలంగాణ రాజధాని హైదరాబాద్లో పర్యటించనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న పబ్లిక్ సర్వీస్ కమిషన్ల చైర్మన్ల జాతీయ సదస్సులో పాల్గొనేందుకు ఆయన విచ్చేస్తున్నారు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ఆధ్వర్యంలో హైదరాబాద్లో “పబ్లిక్ సర్వీస్ కమిషన్ల చైర్మన్ల జాతీయ సదస్సు” ఘనంగా జరగనుంది. ఈ సదస్సుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరవుతుండగా, సీఈసీ జ్ఞానేష్ కుమార్ ప్రత్యేక అతిథిగా పాల్గొననున్నారు.
