
DNews: Dec 11: హైదరాబాద్లోని కొండాపూర్లో బుధవారం సాయంత్రం ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. భారత క్రికెట్ జట్టులో కీలక పాత్ర పోషిస్తున్న సిరాజ్, శరత్ సిటీ క్యాపిటల్ మాల్లో ఏర్పాటు చేసిన ఒక షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని అభిమానులతో మాట్లాడారు. హైదరాబాద్ తనకు ఇల్లు లాంటిదని, ఇక్కడ అభిమానులను కలవడం ఎప్పుడూ ప్రత్యేకమని ఆయన అన్నారు. క్రికెట్ ప్రపంచంలో ఎవరికైనా అవకాశం ఉందని, ప్రతిభ ఉన్నవారు ఎక్కడైనా విజయాన్ని సాధించగలరని చెప్పారు. అంతర్జాతీయ స్థాయికి చేరుకోవడం అంత సులభం కాదని, ఏ ఆటలోనైనా గెలవాలంటే కష్టపడి పనిచేయాల్సి ఉంటుందని, కానీ అది దేశంలోని 140 కోట్ల మంది ప్రజల నమ్మకంతో పోలిస్తే చాలా చిన్నదని ఆయన భావించారు. తాను బౌన్సర్ల కంటే యార్కర్లను ఎక్కువగా ఇష్టపడతానని, వాటితోనే ఎక్కువ వికెట్లు సాధించానని తెలిపారు. హైదరాబాద్లో అన్ని రకాల వంటకాలు లభిస్తున్నా, బిర్యానీ ఎప్పటికీ ప్రత్యేకమేనని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులకు క్రికెట్కు సంబంధించిన కొన్ని ప్రశ్నలు అడిగి, విజేతలకు రూ.50,000 వరకు మరియు కనీసం రూ.20,000 వరకు బహుమతులు అందజేశారు.

