
DNews : Dec 02: తిమ్మాపూర్ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కరీంనగర్ నుండి బేజ్జంకి మండలానికి ఫ్లయింగ్ స్క్వాడ్ విధుల కోసం ఆర్ఏ, టైపిస్ట్, హెడ్ కానిస్టేబుల్ కారులో బయలుదేరారు. అదే సమయంలో హైదరాబాద్ నుండి కరీంనగర్ వైపు వెళ్తున్న మరో కారు తిమ్మాపూర్ మండలంలోని ఇంద్రానగర్ వద్ద నియంత్రణ కోల్పోయి డివైడర్ను ఢీకొట్టి తలకిందులైంది. ఆ కారు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హైదరాబాద్ నుండి కరీంనగర్ వెళ్తున్న వాహనంలోని ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. స్థానికుల సమాచారం మేరకు ఎల్ఎమ్డీ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. గాయపడిన వారిని కరీంనగర్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
