
DNews 29 Nov:హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ను ఆకలి బాధలు లేని నగరంగా మార్చడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మరియు హైదరాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ప్రకటించారు.
శుక్రవారం నాడు (నవంబర్ 28) ముషీరాబాద్ నియోజకవర్గంలోని బాగ్ లింగంపల్లి (సుందరయ్య పార్క్) మరియు కవాడిగూడలలో కొత్తగా ఏర్పాటు చేసిన ఇందిరమ్మ క్యాంటీన్లను మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో పేదల అవసరాలకు అనుగుణంగా మరిన్ని క్యాంటీన్లను ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.
