Dnews 31: అయోధ్య రామ మందిరానికి విరాళంగా ఇచ్చిన రూ.4 కోట్ల బ్యాంకు చెక్ బౌన్స్ అయిన ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది.అయోధ్య రామ మందిరానికి విరాళంగా ఇచ్చిన రూ.4 కోట్ల బ్యాంకు చెక్ బౌన్స్ అయిన ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. చెక్ ఇచ్చిన మహిళ అకౌంట్లో కేవలం రూ.3 ఉన్నట్టు తెలిసింది. చెన్నైకి చెందిన ఓ మహిళ ఈ చెక్కు ఇచ్చింది. అసలేం జరిగిందో తెలుసుకునేందుకు ఆమెకు నోటీసులు జారీ చేసేందుకు శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సిద్ధమతున్నట్టు సమాచారం.జాతీయ మీడియా కథనాల ప్రకారం, మహిళ అప్పటికే రామమందిరానికి రూ.10 వేల విరాళం ఇచ్చింది. ఇక తాను ఇవ్వనున్న రూ.4 కోట్ల విరాళాన్ని సిబ్బంది సౌకర్యాల కల్పనకే వినియోగించాలని కూడా మహిళ షరతు విధించినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయితే, ట్రస్టు మాత్రం అలాంటి హామీ ఏదీ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో మహిళతో చర్చించి సమస్యను పరిష్కరించేందుకు ట్రస్టు వర్గాలు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఉదంతంపై ట్రస్టు అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.రామ జన్మభూమి నిర్మాణానికి సంబంధించి 2020లో నిధి సమర్పణ్ అభియాన్ కార్యక్రమం జరిగిన విషయం తెలిసిందే. అప్పట్లో కేవలం 45 రోజుల్లోనే రూ. 3,500 కోట్ల విరాళాలు అందాయి. ఇక రామ మందిరానికి నెలనెలా రూ.3-4 కోట్ల వరకూ విరాళాలు వస్తుంటాయి. వీటిలో చెక్కు రూపంలో వచ్చే విరాళాలు రూ.1.5 కోట్ల వరకూ ఉంటాయి.

By CS.H

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana