
DNews:27 Jan: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా బీఆర్ఎస్ కీలక నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు జోగినపల్లి సంతోష్ రావు నేడు 27, 2026 సిట్ (SIT) ముందు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయంలో అధికారులు ఆయనను విచారిస్తున్నారు. ఈ కేసులో విచారణకు రావాలని సిట్ నిన్ననే ఆయనకు సెక్షన్ 160 CrPC కింద నోటీసులు జారీ చేసింది. గత ప్రభుత్వ హయాంలో రాజకీయ నేతలు, సెలబ్రిటీల ఫోన్ల ట్యాపింగ్ మరియు ఆధారాల ధ్వంసం ఆరోపణల నేపథ్యంలో సంతోష్ రావుకు ఉన్న సమాచారాన్ని సేకరించేందుకు ఈ విచారణ జరుగుతోంది. విచారణకు హాజరయ్యే ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ, దర్యాప్తుకు పూర్తిస్థాయిలో సహకరిస్తానని, అధికారులు అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానమిస్తానని స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ కేసులో భాగంగా మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులను సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారించి వారి వాంగ్మూలాలను నమోదు చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ నేతృత్వంలోని సిట్ బృందం ఈ దర్యాప్తును వేగవంతం చేస్తోంది.
