
DNews: Apr09: ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ దిగ్గజం యూట్యూబ్, స్మార్ట్ టీవీ వినియోగదారులకు ఒక పెద్ద షాక్ ఇవ్వబోతోంది. ప్రస్తుతం ఉన్న యాడ్స్ నిడివిని గణనీయంగా పెంచుతూ, 90 సెకన్ల పాటు స్కిప్ చేయలేని యాడ్స్ను ప్రవేశపెట్టే ప్రయోగాన్ని అది చేస్తోంది. కొంతమంది వినియోగదారులు తాము 90 సెకన్ల యాడ్స్ను చూస్తున్నామని చూపిస్తూ ఇప్పటికే సోషల్ మీడియాలో ఫోటోలను పోస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం స్మార్ట్ టీవీలలో కేవలం 30 సెకన్ల స్కిప్ చేయలేని యాడ్స్ మాత్రమే వస్తున్నాయి. వీటిని 90 సెకన్లకు పెంచాలని వారు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా 20 నుండి 40 నిమిషాల నిడివి గల వీడియోల కోసం ఈ రకమైన యాడ్స్ను ప్రవేశపెట్టడానికి ప్రణాళికలు రచిస్తున్నారని టెక్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
