
DET:DEC 01:
వారాంతంలో భారీ వసూళ్లు:
ధనుష్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటించిన రొమాంటిక్ డ్రామా ‘తేరే ఇష్క్ మే’ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ప్రారంభాన్ని సొంతం చేసుకుంది. మొదటి వారాంతంలో ఈ చిత్రం భారీ వసూళ్లను రాబట్టింది. సినిమా విడుదలైనప్పటి నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తి పెరగడం, మంచి మౌత్ టాక్ రావడంతో వసూళ్లు రోజురోజుకు పెరుగుతూ వచ్చాయి.
మూడు రోజుల్లోనే రూ. 50 కోట్లు దాటిన తేరే ఇష్క్ మే:
‘తేరే ఇష్క్ మే’ సినిమా మూడో రోజు ఆదివారం ఊహించని బూస్ట్ను అందుకుంది. మొదటి రోజు రూ. 16 కోట్లు వసూలు చేయగా, రెండో రోజు సుమారు రూ. 17 కోట్లు రాబట్టింది. ఇక మూడో రోజు ఆదివారం పండుగ వాతావరణం ఉండడంతో వసూళ్లు మరింత పెరిగి రూ. 18.75 కోట్ల వరకు సాధించింది.దీంతో, ఈ చిత్రం మొదటి మూడు రోజుల్లోనే దేశీయంగా అన్ని భాషల్లో కలిపి రూ. 51.75 కోట్లకు పైగా నికర వసూళ్లను రాబట్టింది. ఈ ఘనత ధనుష్ కెరీర్లోనే ఒక పెద్ద ఓపెనింగ్గా నిలిచింది.
ప్రేక్షకుల స్పందనతో దూకుడు:
దర్శకుడు ఆనంద్ ఎల్. రాయ్ గతంలో ధనుష్తో తీసిన రాంఝనా, అతరంగి రే’ సినిమాల మాదిరిగానే ఈ కొత్త సినిమా ‘తేరే ఇష్క్ మే’ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ధనుష్ నటన, కృతి సనన్ కెమిస్ట్రీ మరియు ఎమోషనల్ కథాంశం సినిమాకు ప్లస్ అయ్యాయి. వీకెండ్లో వసూళ్లు ఇంతలా పెరగడానికి ఈ పాజిటివ్ మౌత్ టాక్ మరియు కుటుంబ ప్రేక్షకుల ఆదరణ ప్రధాన కారణం అని చెప్పవచ్చు.
ముందున్న సవాళ్లు:
మొదటి వారాంతంలో రూ. 50 కోట్ల మైలురాయిని దాటిన ఈ సినిమాకు, సోమవారం నుంచి అసలు పరీక్ష మొదలవుతుంది. వీక్ డేస్లో కూడా ఇదే స్థిరత్వాన్ని కొనసాగిస్తే, రూ. 100 కోట్ల దిశగా సులభంగా దూసుకుపోతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సినిమా త్వరలోనే తన బడ్జెట్ను దాటి లాభాల బాట పట్టాలని అభిమానులు ఆశిస్తున్నారు.
