
DSports 24Mar 2026:ముంబై: క్రికెట్ మైదానంలో భారత్-పాక్ సమరం ఎంత ఉత్కంఠగా ఉంటుందో, గత కొన్నేళ్లుగా పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య పోరు కూడా అదే స్థాయిలో రసవత్తరంగా మారుతోంది. అయితే, ఈ పోటీ కేవలం ఆటకే పరిమితం కాకుండా అభిమానుల ప్రాణాల మీదకు వస్తోందని ఆఫ్ఘన్ ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ ఆవేదన వ్యక్తం చేశారు.
- శుభంకర్ మిశ్రా యూట్యూబ్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గుర్బాజ్ మాట్లాడుతూ.. 2022 ఆసియా కప్లో పాకిస్తాన్ చేతిలో ఎదురైన ఓటమిని గుర్తు చేసుకున్నారు. “నా కెరీర్లో అత్యంత బాధాకరమైన మ్యాచ్ ఏదైనా ఉందంటే అది 2022 ఆసియా కప్లో పాక్తో జరిగిన మ్యాచ్. ఆ మ్యాచ్లో ఓడిపోయిన తర్వాత మా దేశంలో చాలా మంది అభిమానులు కన్నీరు పెట్టుకున్నారు. మరికొందరు ఆ బాధను తట్టుకోలేక ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. మా ప్రజలు క్రికెట్ విషయంలో చాలా ఎమోషనల్గా ఉంటారు” అని గుర్బాజ్ వెల్లడించారు.
