
DNews: Jan8: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై అసెంబ్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఏపీ మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంశంపై చంద్రబాబు, ఏపీ నీటిపారుదల మంత్రి రాక్షసుల లాంటి వ్యక్తుల మాటలు వింటున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు. చంద్రబాబు నాయుడు తన ఇష్టానుసారం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఆపారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కిక్కిరిసిన సభలో ప్రకటించారు. చంద్రబాబు వ్యాఖ్యలను తిప్పికొట్టే ప్రయత్నం కూడా చేయడం లేదు. రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టిన చంద్రబాబు రాష్ట్రానికి పెద్ద విలన్. రాష్ట్రాన్ని మోసం చేసిన చంద్రబాబు చారిత్రక విలన్ గా మిగిలిపోతారని జగన్ గట్టిగా అన్నారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను విమర్శించకుండా ఆయన మద్దతు ఇచ్చారు. దీని అర్థం తాను రహస్య ఒప్పందానికి ఆమోదం తెలిపానని జగన్ అన్నారు. అప్పుడు పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు.. ఇప్పుడు తనకి జన్మనిచ్చిన రాయలసీమకి వెన్నుపోటు పొడిచాడని జగన్ విమర్శించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఒక గొప్ప ప్రాజెక్ట్. సీమను కరువు నుంచి కాపాడేది అదే. ఈ ప్రాజెక్టు సీమ ప్రాంతానికి బీమా లాంటిదని.. ఇది సంజీవని లాంటిదని జగన్ అన్నారు.
